AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!




 అమరావతి: ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ ఆమోదించిన పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇంధన రంగంలో 22 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. 

ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్టు తెలుస్తోంది. జగనన్న తోడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, పంట బీమా కలిపి నాలుగు వేల కోట్ల బకాయిలు అక్టోబర్ నెలల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ సున్నా వడ్డీ చెల్లించలేదు. డిసెంబర్‌ నెలలో ఇస్తామని చెప్పిన పంటల బీమా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా గురించి జగన్ ప్రభుత్వం మరచిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు రుణమాఫీ అని కొత్త ఎత్తులు వేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ అని ప్రచారం చేస్తోంది. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్‌లో కీలక నిర్ణయం అని లీకులు ఇచ్చింది. ‘ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం. డీఎస్సీ నోటిఫికేషన్. అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం‘ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.

Post a Comment

Previous Post Next Post