రాజ్కోట్ లో ముగిసిన మూడవ టెస్ట్ లో అద్భుతంగా మన కుర్రోళ్ళు రాణించారు...
మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ లో వెంట వెంటనే వికెట్లు పడి మూడు వికెట్లు కోల్పోయిన సందర్భంలో రోహిత్ శర్మ తనదైన శైలిలో 131 పరుగులతో సెంచరీ చేయగా రోహిత్ కు జడేజా చక్కగా సహకరిస్తూ మొదటి ఇన్నింగ్స్ సరి అయిన గాడిలో పెట్టారు...
జడేజా కూడా 119 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు... సర్ఫరాజ్ ఖాన్ మొదటి ఇన్నింగ్స్ లో 62 విలువైన పరుగులు చేసాడు..
ఇక రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైపాల్ అద్భుతంగా రాణించే 214 పరుగులు చేశాడు శుభమన్ గిల్ 91 పరుగులు మరల సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు ..
భారీ టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందుఉంచడంతో ఇంగ్లాండ్ లక్ష్యసాధనలో చతికిలపడి 434 పరుగుల తేడా తో ఓడిపోయింది...
టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు అతి భారీ విజయం కాగా రెండవ సారి టెస్టుల్లో ఇంగ్లాండ్ దారుణంగా ఓటమి పాలయింది...